మే 15 వరకు పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు.. 32 విమానాశ్రయాలు మూసివేత!

మే 15 వరకు పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు..  32 విమానాశ్రయాలు మూసివేత!


ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్‌పై కొనసాగుతున్న చర్యల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలను గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అయితే, దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు శనివారం (మే 10) వరకు మూసివేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం (మే 8) ప్రకటించింది. కానీ పాకిస్తాన్ నుండి నిరంతర దాడులు జరిగిన తరువాత, కేంద్ర ప్రభుత్వం తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మే 15 వరకు కేంద్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించిన 24 విమానాశ్రయాలలో చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్‌కోట్, జమ్మూ, బికనీర్, లేహ్, పోర్‌బందర్ సహా అనేక ఇతర విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలన్నీ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నగరాల్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో, భద్రత దృష్ట్యా ఇవన్నీ మూసివేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదం దృష్ట్యా, అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ప్రయాణ సలహాను జారీ చేశాయి. విమానాశ్రయ మూసివేతలు, పెరిగిన భద్రతా ప్రోటోకాల్‌ల గురించి ప్రయాణీకులు తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని కోరుతూ కంపెనీలు సలహాలు జారీ చేశాయి.

ఎయిర్ ఇండియా శుక్రవారం (మే 9) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. “విమానయాన అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల మూసివేత ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇంతలో, జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే అన్ని విమానాలు గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు రద్దు చేయబడ్డాయి” అని ఎయిర్‌లైన్ కంపెనీ పోస్ట్‌లో రాసింది. “ప్రస్తుత సమయంలో, ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్న వినియోగదారులందరికీ ప్రయాణ మార్పు లేదా టికెట్ రద్దుపై పూర్తి వాపసు విషయంలో ధరపై ఒకేసారి తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది” అని కంపెనీ పేర్కొంది.

అదే సమయంలో, మే 15 వరకు 24 నగరాల్లో విమానాశ్రయాలు మూసివేయంతో విమానాల రద్దుకు సంబంధించి విమానయాన సంస్థ ఇండిగో కూడా ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *