వియత్నాంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం హలోంగ్ బేలో పర్యాటక పడవ బోల్తా పడిన ఘటనలో 34 మంది మరణించగా, డజనుకు పైగా ప్రజలు గల్లంతయ్యారు. వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మీడియా ప్రకారం, పడవలో మొత్తం 53 మంది టూరిస్ట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను ‘విఫా’ కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షం, మెరుపులు వీచాయని నివేదికలు వచ్చాయి. బోటు మునిగిపోవడంతో నీటిలో గల్లంతైన వారిని కాపాడేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి సహాయకబృందాలు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకుల బృందం పడవలో వెళ్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో బలమైన గాలులు, వర్షం ప్రారంభమైంది. ఈ భయంకరమైన విపత్తు మధ్యలో పడవ బోల్తా పడింది. నీటిలో పడవ బోల్తా పడటంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పడవ ప్రయాణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సంవత్సరం దక్షిణ చైనా సముద్రాన్ని తాకిన మూడవ తుఫాను ‘వైఫా’, ఇది వచ్చే వారం ప్రారంభంలో వియత్నాం ఉత్తర తీరాన్ని తాకవచ్చు. తుఫాను ఈ ప్రమాదకరమైన వాతావరణానికి కారణమైంది. ఇది విమాన ప్రయాణాన్ని కూడా ప్రభావితం చేసింది. శనివారం 9 ఇన్కమింగ్ విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చిందని, 3 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నోయి బాయి విమానాశ్రయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఏం తెలివిరా నాయానా..! ఇలాంటి దొంగతనం మీరు ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి