Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!


విన్నపాలు వినవలె అంటూ ఇష్ట దైవానికి అర్జీలు పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు. మరికొన్నిసార్లు.. కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో వెలుగుచూసింది. తాజాగా కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకా ఘత్తరగి గ్రామంలోని భాగ్యవంతి దేవి టెంపుల్ హుండీ లెక్కింపు చేపట్టారు ఆలయ నిర్వాహకులు. నగదు లెక్కపెడుతుండగా.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ కంగుతిన్నారు. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రూ.20 నోటుపై రాసి ఉంది. అత్త చావును అంతలా ఆకాంక్షిస్తున్నది అల్లుడా, కోడలా అనే చర్చ మొదలైంది. సంవత్సరానికి ఒకసారి గ్రామంలోని ఈ ఆలయ హుండీల్లో నగదు లెక్కిస్తారు. ఈ ఏడాది రూ.60 లక్షల డబ్బు, ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *