అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగుమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి దంగేటి

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగుమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి దంగేటి


ఇటీవలె శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు మన తెలుగుమ్మాయి కూడా అంతరిక్ష యాత్ర చేయనుంది. అది కూడా అతి చిన్న వయసులోనే. ఆ అమ్మాయి ఎవరు? ఆ మిషన్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల జాహ్నవి దంగేటి 2029లో స్పేస్‌లోకి వెళ్లనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీర్ అయితే జాహ్నవి భారత్‌ తరఫున సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. 2029 లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ (ASCAN) ప్రోగ్రామ్ కింద ఒక ఆర్బిటల్ స్పేస్ మిషన్‌లో ఆమె స్పేస్‌లోకి వెళ్తనున్నారు. ఇటువంటి మిషన్‌కు ఎంపికైన మొదటి భారతీయ అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.

ఐదు గంటల ప్రయాణం..

ఐదు గంటల ప్రయానంలో మూడు గంటల నిరంతర సున్నా గురుత్వాకర్షణ ఉంటుంది. ఈ సమయంలో జాహ్నవి, ఆమె తోటి సిబ్బంది భూమి చుట్టూ రెండు రౌండ్లు వేయనున్నారు. ఒకే మిషన్‌లో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను అనుభవిస్తారు. ఈ మిషన్‌కు రిటైర్డ్ నాసా వ్యోమగామి, యుఎస్ ఆర్మీ కల్నల్ విలియం మెక్‌ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం టైటాన్స్ స్పేస్‌లో ఆయన చీఫ్ ఆస్ట్రోనాట్‌గా ఉన్నారు. ఈ మిషన్ శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష విమాన పరీక్షలు, ప్రపంచ స్థాయిలో విద్యా కార్యకలాపాలకు దోహదపడనుంది.

జాహ్నవి జర్నీ..

జాహ్నవికి ఖగోళ శాస్త్రం, STEM పట్ల ఉన్న మక్కువతో ఆమె జర్నీ ప్రారంభమైంది. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP)ను పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఆమె. అక్కడ ఆమె ‘టీమ్ కెన్నెడీ’కి మిషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అంతర్జాతీయ బృందంతో కూడిన విజయవంతమైన రాకెట్ ప్రయోగ అనుకరణకు నాయకత్వం వహించారు. తరువాత ఆమె జీరో-గ్రావిటీ విమానాలు, స్పేస్ సూట్ ఆపరేషన్లు, ప్లానెటరీ సిమ్యులేషన్లు, హై-ఆల్టిట్యూడ్ మిషన్లలో శిక్షణ పొందారు. 2022లో పోలాండ్‌లోని క్రాకోలో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ (AATC) ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. ఆమె సాధించిన విజయాలలో అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారం, స్పేస్ ఐస్‌ల్యాండ్‌తో భూగర్భ శాస్త్ర క్షేత్ర శిక్షణ ద్వారా గ్రహశకలాల ఆవిష్కరణ సహకారాలు కూడా ఉన్నాయి.

జాహ్నవి 2026లో టైటాన్స్ స్పేస్ ఆస్ట్రోనాట్ క్లాస్ 2025లో భాగంగా తన అధికారిక వ్యోమగామి శిక్షణను ప్రారంభిస్తారు. ఈ శిక్షణలో అంతరిక్ష నౌక వ్యవస్థలు, వైద్య మూల్యాంకనాలు, విమాన అనుకరణలు, అత్యవసర విధానాలు, మానసిక అంచనాల వరకు మనుగడ శిక్షణ ఉంటుంది. లింక్డ్ఇన్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో జాహ్నవి తన చిన్ననాటి కలను ఇలా తెలిపారు.. “చిన్నప్పుడు, నేను తరచుగా చంద్రుడిని చూసాను, అది నన్ను అనుసరిస్తుందని నమ్మాను. ఆ ఆశ్చర్యకరమైన భావన ఎప్పటికీ వీడలేదు. నేడు అది నా వాస్తవికతలో భాగమవుతోందని చెప్పేందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను.” తన సొంత ఆశయానికి మించి, జాహ్నవి తన ప్రయాణాన్ని ప్రతీకాత్మకంగా చూస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె ఇలా పేర్కొన్నారు.. “నా మూలాలను, నేను సంవత్సరాలుగా కలిసిన అద్భుతమైన యువ కలలు కనేవారిని ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను – ఈ లక్ష్యం పైకి చూసే, అసాధ్యాన్ని ఊహించే మనందరికీ.” అని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *