అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణుల దాడి!

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణుల దాడి!


తమ దేశంలోని అణు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతికార దాడులు మొదటు పెట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్‌ మిసైళ్లు క్షిపణులతో దాడులకు దిగింది. ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అధికారికంగా వెల్లడించింది.

అమెరికాపై ఇరాన్ ప్రతికార దాడులను ప్రారంభించింది. దోహాలోని అమెరికా స్థావరంపై ఇరాన్ 6 మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైళ్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్‌ వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులు విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెంటనే సిచ్యుయేషన్‌ రూమ్‌’కు చేరుకున్నారు. ఇరాన్‌ ప్రతీకార దాడులకు ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఆయన పరిశీలిస్తున్నారు.

మరోవైపు తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ బెషారత్‌ ఫతా’ పేరుతో శక్తివంతమైన మిస్సైళ్లను అమెరికా స్థావరాలపై ప్రయోగించినట్లు ఇరాన్‌ ఆర్మీ దళాలు పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *