
ఇందులో సమీపంలోని ఒక హాల్లో ఒక ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతుంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు. ముస్లిం కుటుంబం ఎటువంటి సంకోచం లేకుండా దాదాపు గంటసేపు వేదికను ఇచ్చింది. రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధూ బంధువులు శాంతారాం కావాడే తెలిపారు. మంగళాష్టకం సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం అనంతరం రెండు వర్గాల ప్రజలు కలిసి భోజనం చేశారు. ఈ దృశ్యం పరస్పర సామరస్యం, సామాజిక ఐక్యతకు ఉదాహరణగా నిలిచింది. మతం కారణంగా సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ ఇలాంటి సంఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది. వర్షం ఒక వివాహానికి అంతరాయం కలిగించి ఉండవచ్చు. కానీ ఈ సహాయం కొత్త సంబంధాన్ని సృష్టించింది. ఈ సంఘటన గురించి పూనేలోని ప్రజలలో సానుకూల చర్చ జరుగుతుంది.