ఈ-ఆధార్ ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు లూటీ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నంబరుతో కొత్త సిమ్ కార్డు సృష్టించి, అసలు సిమ్కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్ బ్లాక్ చేసి, అసలు సిమ్కార్డును పునరుద్ధరిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు కూడా తెలియదు.ఆధార్ కార్డ్ను జిరాక్స్ తీసుకునేటప్పుడు ప్రింట్ సరిగా రాలేదని అక్కడే పడేస్తుంటారు. అయితే అలాంటి పొరపాటు మాత్రం చేయొద్దంటున్నారు నిపుణులు. ప్రింట్ సరిగా రాని జిరాక్స్ కాపీని ఇంటికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని సూచిస్తున్నారు. తెలియని వారికి ఆధార్ కార్డులను మెయిల్స్, వాట్సప్ చేయవద్దు. చాలా వరకు చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.