ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?

ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?


పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. నరసరావుపేటలోని జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన విద్యార్థిని పావని చంద్రిక 10వ తరగతిలో 598 మార్కులు సాధించింది. ప్రభుత్వ స్కూల్‌లో చదివి 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించిన పావని చంద్రికను జిల్లా విద్యాశాఖ అధికారులకు మెచ్చుకున్నారు. విద్యార్థిని పావని చంద్రికతో పాటు ఆమె తల్లిదండ్రులు, పాఠశాల హెడ్‌మాస్టర్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ చంద్రకళ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చినట్టు తెలిపింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

తనను అధికారులు మెచ్చుకోవడం పట్ల విద్యార్థిని పావని హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ
పదవ తరగతి ఫలితాలలో తనకు 598 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందంది. తన అమ్మమ్మ, స్కూల్‌ చీటర్లు,
స్కూల్ హెడ్‌మాస్టర్ కృషి వల్లే తాను ఈ మార్కలు సాధించినట్టు తెలిపింది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ తన అమ్మమ్మ తనను ఎంతో జాగ్రత్త తీసుకుని చదివించిందని తెలిపింది. భవిష్యత్తులో తాను IAS కావాలని అనుకుంటున్నానని..ఐఏఎస్ చదవడానికి ప్రభుత్వం సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని విద్యార్థిని పావని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *