కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!


శరీరంలోని మలినాలను బయటకు పంపించే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఓ పరిమిత మొత్తంలో నీళ్లు తాగాలని వైద్య ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు తగినంత నీళ్లు తాగితేనే కిడ్నీలు మలినాలను తొలగించి, శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం…

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 నుంచి 3 లీటర్లు అంటే 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు.. దీనివల్ల కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. ముదురు పసుపు పచ్చ రంగు మూత్రం, చాలా తక్కువగా మూత్రానికి వెళ్లడం, నోరు పొడిబారడం, అలసట మీరు డీహైడ్రేషన్‌కు గురయ్యారన్నదానికి సంకేతాలు అంటున్నారు.

ఆరోగ్యకరమైన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. రోజుకు కనీసం ఆరు నుంచి 8 సార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం. నీళ్లు మరీ ఎక్కువగా తాగినా ప్రమాదమే. అంటే రోజుకు 4 లేదా 5 లీటర్లకు మించి నీళ్లు తాగితే శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలపై భారం కూడా పెరుగుతుంది. కిడ్నీల కోసం రోజూ కేవలం మంచి నీళ్లే ఎక్కువగా తాగడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్, ఆల్కహాల్, అతిగా కెఫీన్ తీసుకోవడం కిడ్నీలను దెబ్బ తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *