ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో


మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక మీడియా ప్రకారం, సమర్థ్ అనే విద్యార్థి వ్యక్తి గత పనికోసం పంచ్‌గని ప్రాంతానికి వెళ్లాడు. అదే రోజు అతడు ఓ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అతడు పని ముగించుకుని ఎగ్జామ్‌కి బయలుదేరే సరికి ఆలస్యం అయిపోయింది. పరీక్షకు ఇంకా 15 నిమిషాల సమయమే మిగిలుంది. ఒక్కసారిగా ట్రాఫిక్‌ కళ్లముందు కదలాడింది. తనకున్న సమయంలో రోడ్డులో వెళ్తే పరీక్షకు హాజరుకాలేనని అర్థమైంది. దీంతో, అతడు పారాచూట్ సాయంతో పరీక్ష కేంద్రంలో దిగాడు. పంచగనీలోని జీపీ అడ్వంచెర్స్ సంస్థ యజమాని, సాహస క్రీడల నిపుణుడు గోవింద్ యెవాలే అతడికి సహకరించాడు. తన టీంతో కలిసి అతడు అన్ని ఏర్పాట్లు చేశాడు. దీంతో, పారాచూట్ ద్వారా సమర్థ్ గాల్లో తేలుతూ పరీక్ష కేంద్రం వద్ద దిగాడు. పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లతో, నిపుణులైన పారాగ్లైడర్స్ పర్యవేక్షణలో సమర్థ్‌ తన సాహసాన్ని పూర్తి చేశాడు. కాగా, మహరాష్ట్రలోని సతారా ప్రాంతం పారాగ్లైండింగ్ క్రీడలకు ప్రసిద్ధి. ఇక్కడ సాహసక్రీడలకు అనుకూలమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. మరోవైపు, సమర్థ్‌ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం

దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా..?

ఇది సింహ గర్జన కాదు.. మొసళ్ల గర్జన.. వీడియో

స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్మిన మల్లారెడ్డి..సోషల్‌ మీడియాలో వైరల్‌

చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది: కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *