ఇక ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా 1.3 మిలియన్లకు పైగా టికెట్ల విక్రయం జరిగినట్లు సంస్థ వెల్లడించింది. వారాంతం కావడం, సంక్రాంతి సెలవులు రావడంతో ఈ టికెట్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా..సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు