శీతాకాలంలో చలి కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మనలను చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.
పొటాషియం తక్కువగా ఉన్నప్పుడే గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థ బలంగా ఉండటానికి, సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
నారింజ పండుతో గుండె ఆరోగ్యమే కాదు ఈ ప్రయోజనాలు కూడా సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్లను తినడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ నివారణకు కూడా నారింజ పండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే డైటరీ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీలలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.
నారింజ రసంలో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ముఖ ముడతలను తగ్గిస్తుంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇది గాయాల వల్ల ఏర్పడే డార్క్ స్పాట్లను తొలగించడంలో సహాయపడుతుంది. నారింజ పండులో ఉండే పోషకాలు మన కంటి చూపును కూడా మెరుగుపరిచి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.