మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చక్కనమ్మ. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏవీ రాలేదు. అయితే ఈ మూవీ తర్వాత ప్రగ్యా కంచె సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవీ ఈ అమ్మడుకు మంచి ఫేమ్ తీసుకరాలేకపోయాయి. కానీ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ వచ్చింది. బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమా హిట్ అయినా కానీ ఈ అమ్మడుకు ఊహించిన రేంజ్లో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇక రీసెంట్గా ఈ చిన్నది డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలయ్య సరసన నటించి మెప్పించింది. ఈ మూవీతో మరోసారి తన అభిమానులను పలకరించింది.ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. అయినా కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రావడం లేదని సమాచారం.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి ఆరెంజ్ కలర్ డ్రెస్లో తన అందాలతో నెటిజన్స్కు చెమటలు పట్టించింది. ఆరెంజ్ కలర్ స్కట్లో కుర్రకారును తన వైపు లాక్కుంది. అంతే కాకుండా చెట్లు, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
హాట్ హాట్గా చూస్తూ..తన గ్లామర్తో అందాల ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.