దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను


ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి రూ. 4.88 కోట్లకు పైగా ఉన్న ఆదాయం కలిగి ఉన్నారని, దీనిపై వారు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడేళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోస్టుమాన్ సాయంతో విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు కంగుతిన్నారు. ఆదాయపు పన్ను అంటే ఏమిటో కూడా తనకు తెలియదని వృద్ధురాలు వాపోయింది. ఈ ఘటనపై న్యాయవాది సంజయ్ జైన్ స్పందిస్తూ…ఇటీవలి కాలంలో నోటీసులు జారీ చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే వృద్ధురాలికి నోటీసులు వచ్చాయని తెలిపారు. పొరపాటు జరగని పక్షంలో ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి

బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్‌ హీరో వేధింపులు

30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??

విక్రమ్‌ కొడుకుకు అనుపమ లిప్‌ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్

Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *