ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బంత్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడు 75 ఏళ్ల వ్యక్తి. ఈ సంఘటన మే 8న జరిగినట్లు చెబుతున్నారు. సంఘటన జరిగిన రోజు ఆమె తండ్రి ఉద్యోగానికి వెళ్లగా, ఆమె తల్లి బంధువులను కలవడానికి వెళ్లింది. నిందితుడు దీన్ని ఆసరాగా చేసుకుని 2వ తరగతి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబం సభ్యులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. నిందితుడు బాలికను తమ పాత ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సంఘటన జరిగిన రోజు, బాధితురాలి తండ్రి పనికి వెళ్లగా, తల్లి బంధువుల వద్దకు వెళ్లింది.
ఆ బాలిక తన 4 ఏళ్ల సోదరి, 2.5 ఏళ్ల సోదరుడితో కలిసి ఇంట్లో ఉంది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. మామిడి పండ్లు ఇస్తానని చెప్పి బాలికను తన పాత ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఇల్లు బాధితురాలి ఇంటి నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అతను బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ బాలిక ఆమెకు జరిగిన మొత్తం సంఘటన గురించి చెప్పింది. మొదట్లో గ్రామంలోని కొంతమంది ఈ విషయాన్ని అణిచివేయడానికి ప్రయత్నించారు. కానీ బాధితురాలి తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంత్రా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ రాణా రాజేష్ సింగ్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..