పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరో వైపు కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. తగ్గింది అనుకొని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి తన ప్రతాపం చూపెట్టడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ సమయంలో తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉంది. కరోనా భయం వల్ల పిల్లలను బడికి పంపకుండా ఉండటం సాధ్యం కాదు. అందు వలన పాఠశాలకు వెళ్లే పిల్లలను ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి వైరల్ ఫీవర్స్ నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాతావరణం మారినప్పుడు పిల్లలకు సాధారణంగా జలుబు, దగ్గు రావడం అనేది చాలా కామన్. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో ఏదైనా సమస్య కనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. దీని వలన సమస్యను త్వరగా నయం చేసిన వారిమి అవుతాము.
అలాగే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినిపించాలి. అంతే కాకుండా వారికి ఎట్టి పరిస్థితుల్లో బయటి పుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉండే ఫ్రూట్స్, ఆహార పదార్థాలను వారికి ఇవ్వడం చాలా ఉత్తమం.
రోజుకు కనీసం ఒక్కసారైనా నిమ్మరసం తయారు చేసి పిల్లలకు ఇవ్వండి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పిల్లలకు చల్లటి నీటి కంటే వేడి నీరు తాగించాలి.దీని వలన వారు ఆరోగ్యంగా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి.