మైసూర్ నగరం ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి చాముండి కొండలు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయమే కాకుండా ఈ ప్లేస్ ట్రెక్కింగ్కు కూడా చాలా అనువైనదంట. చాముండేశ్వరి ఆలయం ఎక్కిన తర్వాత ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుందంట. ఇది మంచి అనుభూతిని ఇస్తుందంట.
మైసూర్ నగరంలో శ్రీ వేణుగోపాల కృష్ణ ఆలయం తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఆలయంలో జిప్ లైనింగ్ ఎంజాయ్ చేయవచ్చును. ఉత్కంఠను రేకెత్తించే విధంగా 400 మీటర్ల పొడువు ఈ రైడ్ మంచి అనుభూతిని, థ్రిల్లింగ్ను ఇస్తుందంట.
బల్మూరి జలపాతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ గల గలపారే సెలయేళ్లు, చల్లటి వాతావరణం పర్యాటకులకు హాయినిస్తుంది. అయితే ఇక్కడ రాక్ క్లైంబంగ్ సెషన్లను అందిస్తుందంట.
మైసూర్కు వెళ్లి మీరు ఏదైనా సాహసం చేయాలి అనుకుంటే బెలూన్ రైడ్ బెస్ట్. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఎయిర్ బెలూనింగ్ ప్రయత్నించ వచ్చు. అంతే కాకుండా దాని ద్వారా అందమైన మైసూర్ నగరాన్ని వీక్షించవచ్చునంట.ఇది మీకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
అలాగే మైసూర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమవద్ గోపాల స్వామి బెట్ట ఒక హిల్ స్టేషన్. ఇది పొగమంచుతో అందంగ ఉంటుంది. ఈ హిమవద్ గోపాల బెట్ట క్యాంపింగ్, నైట్ ట్రెక్కింగ్కు చాలా అనువైన గమ్యస్థానం.