విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..


దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసే ఘటన గురువారం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంతా విమానంలో ఉన్నవాళ్లు అయితే.. విమానం కూలిన బిల్డింగ్‌లోని మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఇందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బంది మరణించారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు 11ఏ సీట్‌లో కూర్చున్న రమేష్‌ అనే ప్రయాణికుడు మాత్రమే అదృష్టం కొద్ది బయటపడ్డాడు.

అయితే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన కో పైలెట్‌ క్లైవ్‌ కుందర్‌ ఓ బాలీవుడ్‌ హీరోకు బంధువు అవుతాడు. క్లైవ్ కుందర్ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు అని తెలిసింది. దీనిని విక్రాంత్ మాస్సే స్వయంగా ధృవీకరించారు. ’12వ ఫెయిల్’ సినిమాతో ఫేమ్‌ పొందిన విక్రాంత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన బంధువు క్లైవ్ కుందర్ మరణం పట్ల ఆయన బాధను తెలియజేశారు.

“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు, ప్రియమైనవారి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ కూడా చనిపోయాడని తెలిసి మరింత…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *