పెళ్లి తంతును తిలకించారు. కాళ్ళు కడగడం, జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణ జలధార మంత్రం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివరిలో మూడు ముళ్ళ తంతు. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి తాను ఏడుపు శురు చేసింది. ఏంటా అని అడిగేసరికి ప్లేటు పెరాయిచ్చింది. నాకు వద్దు ఈ పెళ్లి అంటూ తెగేసి చెప్పింది. ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదు అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కన్నవారు అయినవారు అందరూ ఎందుకు ఇలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు. ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వధువు ఎవ్వరి మాట వినలేదు. పెళ్లి ఆగిపోయిన మాటర్ తెలుసుకున్న పోలీసులు కూడా మండపానికి వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు వధువు ఓపెన్ అయింది.