ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దల్లా నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ భాభీ అలియాస్ కాంచన్ కుమారి అనుమానాస్పద స్థితి శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆగి ఉన్న కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో కాంచన్ కుమారి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.
లూధియానాకు చెందిన కమల్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 3.83 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఎక్కువగా రీల్స్తో నెటిజన్లను ఆకట్టుకుంటారు. లూధియానాలో నివసించే కాంచన్ జూన్ 9న బటిండాకు వెళ్లి అదృశ్యమయ్యారు.
గతేడాది అక్టోబర్లో ఆమెకు కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాది అర్ష్దల్లా నుంచి బెదిరింపులు వచ్చాయి. కొన్నిరకాల వీడియోలు పోస్టు చేయడం ఆపేయాలంటూ హెచ్చరికలు వచ్చాయి. లేదంటే..వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆమె మృతి కేసును హత్యగా పరిగణిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక ఆమె చివరి పోస్టు మూడు రోజుల క్రితం చేసినట్టుగా ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..