
వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని స్కెచ్ వేశారు.. కట్ చేస్తే.. లాస్ట్లో అసలు ట్విస్ట్ ఇదే!
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధ మహిళపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కళ్ళల్లో కారం చల్లి ఒంటిపై ఉన్న ఆరున్నర లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్ళారు. తీరా చూస్తే ఆ ముగ్గురు దుండగులు అదే వీధిలో ఉంటున్న వారే కావడం విశేషం. వృద్ధ మహిళ ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో కారం చల్లారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు….