
కోహ్లీ, రోహిత్లను వెనక్కునెట్టేసిన ధోని.. లేటు వయసులోనూ తగ్గేదేలే అంటోన్న చెన్నై సారథి..
నేటి సోషల్ మీడియా యుగంలో ఏదైనా శోధించడానికి లేదా దేని గురించైనా తెలుసుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని వెతికి, తనిఖీ చేస్తుంటారు. ఇక భారతదేశాన్ని చూసుకుంటే, అభిమానులు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల కోసం ఎక్కువగా వెతుకుతుంటారు. ఇతర క్రీడలతో పోలిస్తే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. దీనివల్ల అభిమానులు సోషల్ మీడియాలో క్రికెటర్లను శోధిస్తుంటారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ప్రతి నెలా, సంవత్సరం…