
రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్గాంధీ చేస్తున్న ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని , పోలైన ఓట్ల వివరాలన్నీ వెల్లడించాలని రాహుల్గాంధీ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. రాహుల్గాంధీ డిమాండ్పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 2009 నుంచి ఎన్నికల రోల్స్ను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్గాంధీ…