
Andhra: ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ
ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్ నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టును మరింత విస్తరిస్తామన్నారు కేంద్రమంత్రి. ప్రతి ఎయిర్ పోర్ట్ లో అదనపు విమానాలు…