Telangana: పన్నీర్ కర్రీ తినదామని ఆర్డర్ ఇచ్చాడు.. సర్వ్ చేయగానే ప్లేట్‌లో కనిపించింది చూసి

Telangana: పన్నీర్ కర్రీ తినదామని ఆర్డర్ ఇచ్చాడు.. సర్వ్ చేయగానే ప్లేట్‌లో కనిపించింది చూసి


పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిలీల రెస్టారెంట్‌లో పన్నీరు కర్రీలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో వినియోగదారుడు కంగుతిన్నాడు. పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆకలి తీర్చుకోవడానికి రెస్టారెంట్‌కి వెళ్లాడు. బటర్ నాన్‌తో పాటు పన్నీరు కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. బటర్ నాన్ తినేందుకు ఉపక్రమించి చూసేసరికి.. కర్రీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో షాక్‌కు గురైన ఆ యువకుడు.. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులకు చెబితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇక లాభం లేక.. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాడు.

వెంటనే మున్సిపల్ అధికారులు ఆ కర్రీని పరిశీలించారు. బొద్దింకను గుర్తించారు. వెంటనే రూ. 20 వేల ఫైన్ విధించి.. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే హోటల్ సీజ్ చేస్తామని హోటల్ యాజమానిని హెచ్చరించారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. హోటల్స్‌లో భోజనం చేయాలంటే భయపడుతున్నారు. శుభ్రమైన ఆహారం అందించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *