ఇలా ఐదు రూపాయలకు అందించే టిఫిన్కి వాస్తవంగా రూ.19 ఖర్చు కానుండగా.. ఈ మొత్తంలో రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి మిగతా రూ.5 వసూలు చేస్తారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో ప్రతి రోజు ఉదయం 7-10 గంటల మధ్య రూ.5కే ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, వడ వంటి వాటితో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు.