ప్రపంచ మలయాళీ కౌన్సిల్(WMC) 14వ ద్వైవార్షిక సమావేశం గురువారం బ్యాంకాక్లోని రాయల్ ఆర్చిడ్ షెరాటన్ హోటల్లో గ్రాండ్ క్రూయిజ్ డిన్నర్తో ప్రారంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాలలోని 70 ప్రావిన్సుల నుంచి రికార్డు స్థాయిలో 565 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మలయాళీ సంస్కృతి, వారి గౌరవం, ప్రపంచ స్ఫూర్తిని పండుగగా జరుపుకునేలా ఈ వేడుక సిద్దమయ్యింది.
ఈ సమావేశంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గ్లోబల్ జనరల్ కౌన్సిల్కి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్తో పాటు కొత్త గ్లోబల్ ఆఫీస్ చీఫ్ల ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.
ఈ సమావేశం WMC చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి, ఇది దాదాపు అన్ని దేశాలలో మలయాళీల ఉనికిని ప్రతిబింబిస్తుంది అని గ్లోబల్ సెక్రటరీ జనరల్ దినేష్ నాయర్ అన్నారు.
“ప్రపంచవ్యాప్తంగా మలయాళీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో, ప్రపంచవ్యాప్తంగా మలయాళీల ఐక్యత, సంస్కృతి, సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో WMC ఒక చోదక శక్తిగా ఉంది” అని గ్లోబల్ అధ్యక్షుడు థామస్ మోటకల్ అన్నారు.
ఈ సమావేశం మలయాళీ సమాజం గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని.. ప్రతినిధులు ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుందని భావిస్తున్నట్టు గ్లోబల్ ట్రెజరర్ షాజీ మాథ్యూ అన్నారు.
గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, మేధోపరమైన చర్చలు, నెట్వర్కింగ్ అవకాశాలతో, WMC గ్లోబల్ కాన్ఫరెన్స్ 2025 హాజరైన వారందరికీ మరపురాని అనుభవంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.