Telangana: చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!

Telangana: చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!


కొత్తకోట, జనవరి 7: నదిలో చేపల వేటకు వెళ్లారు కొందరు జాలరులు. నది మధ్యలోకి వెళ్లి వల విసిరారు. వల బరువెక్కడంతో ఆశగా జాలర్లు దానిని బయటకు లాగారు. తీరా వలను ఓపెన్‌ చేసి చూడగా.. లోపల ఉన్న దానిని చూసి అవాక్కయ్యారు. చేపల వలలో ఏకంగా 11 కేజీల బరువున్న భారీ ఆకారం వారికి కనిపించింది. ఏంటాని చూడగా.. దెబ్బకు భయంతో బిక్కసచ్చిపోయారు. ఈ విచిత్ర ఘటన కొత్తకోట మండలం కానాయాపల్లి గ్రామ శివారులో ఉన్న పంప్ హౌస్ పక్కన ఉన్న కెనాల్‌లో సోమవారం (జనవరి 6) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయాపల్లి గ్రామ శివారులో ఉన్న పంప్ హౌస్ పక్కన ఉన్న నదిలో కొందరు వ్యక్తులు చేపల కోసం వేసిరారు. ఆ వలలో చేపలకు బదులు ఏకంగా భారీ కొండచిలువ చిక్కింది. దాని బరువు 11 కేజీలకు పైగా ఉంది. ఈ విషయం పంప్ హౌస్‌లో ఉన్న సిబ్బంది గమనించి స్నేక్ సొసైటీ వ్యవస్థాపనకులు చీర్ల కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చీర్ల కృష్ణ సాగర్‌ వలలో చిక్కిన కొండచిలువను సురక్షితంగా బయటికి తీశారు.

Python Caught In Fishing Net

Python Caught In Fishing Net

ఈ సందర్భంగా స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు అడవి పందులు, అడవి జంతువుల కోసం వలలు, కరెంట్ తీగలు పెట్టడం వలన ఎన్నో రకాల అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. వీటితోపాటు మనుషులు కూడా కరెంట్ షాక్‌కు గురై తగిలి మృతి చెందుతున్నారు. కాబట్టి రైతులు తమ పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఇతర ఇలాంటి ప్రమాదకర ఉచ్చులను వేయడానికి బదులు సాంకేతికతను ఉపయోగించుకొని రసాయన మందులు పిచికారి చేయాలని కృష్ణ సాగర్ అన్నారు. అనంతరం వలలో నుంచి బయటకు తీసిని కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *