అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు బజార్లో ప్రతీ షాపూ తిరుగుతూ నచ్చిన కూరగాయలు కొనుక్కున్నారు. అమలాపురంలో రైతు బజార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ నిషాంతి రైతులు ఏర్పాటుచేసిన కూరగాయల స్టాల్స్ వద్దకు వెళ్లి స్వయంగా కూరగాయలను కొనుక్కున్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా షాపు షాప్ కు వెళ్లి తనకు నచ్చిన ఆకుకూరలు, బెండకాయలు, బీరకాయలు, టమాటాలతో పాటు పలు రకాల కూరగాయలు స్వయంగా కొనుక్కోవడంతో రైతులు హ్యాపీగా ఫీలయ్యారు. జాయింట్ కలెక్టరే స్వయంగానే షాపు షాపూ తిరిగి కూరగాయలు కొనడం చూసి.. అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి