దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయజెండాను గవర్నర్ జిష్ణుదేవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి.. రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసరాల్లో 11 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను మూడు రంగుల జెండాలు, లైట్లతో అలంకరించారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్.