Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత అతనే? ఫేమస్ జ్యోతిష్కుడి ప్రిడిక్షన్!

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత అతనే? ఫేమస్ జ్యోతిష్కుడి ప్రిడిక్షన్!


భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 9న జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఇరుజట్లు సిద్ధంగా ఉన్నాయి. లీగ్ దశలో ఒక్క పరాజయాన్ని కూడా చూడని టీమిండియా, ఫైనల్‌లోనూ విజయ కేతనం ఎగరేయాలని ఉత్సాహంగా ఉంది. మరోవైపు, లీగ్ దశలో కేవలం భారత్ చేతిలో ఓడిన న్యూజిలాండ్, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. ఈ హోరాహోరీ పోరుకు ముందు ఓ ప్రముఖ జ్యోతిష్కుడు ఫైనల్ విజేత ఎవరో ముందుగానే చెప్పేశాడు.

ప్రముఖ జ్యోతిష్కుడు గ్రీన్ స్టోన్ లోబో తన అంచనాలు పంచుకుంటూ భారత్ ఫైనల్‌ను గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంటుందని వెల్లడించాడు. లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆపై సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు సాధించిన ఘన విజయం, ఈ జట్టు టైటిల్ గెలవడానికి తగిన బలం ఉందని చెబుతున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన రోహిత్ శర్మ, మరో ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో జమ చేసుకునే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ గెలుపు కోటా!

లోబో మాట్లాడుతూ, “ధోనీ తర్వాత ఈ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడెవరైనా ఉన్నాడంటే, అది రోహిత్ శర్మనే. అతడికి అద్భుతమైన జాతకం ఉంది. అతడు మెగా టోర్నమెంట్స్‌లో విజయం సాధించగల సామర్థ్యం ఉన్న గొప్ప కెప్టెన్” అని పేర్కొన్నాడు. అయితే, 2023 ప్రపంచకప్‌ను రోహిత్ ఎందుకు గెలవలేకపోయాడో కూడా తన విశ్లేషణలో వివరించాడు.

“ఒక వ్యక్తి తన జీవితంలో ముందే లిఖించబడిన గెలుపు కోటా మాత్రమే పొందగలడు. రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచి, ఇప్పటికే తన గెలుపు కోటాలో గణనీయమైన భాగాన్ని ఉపయోగించేశాడు. అతడు ఆటగాడిగా గెలిస్తే, భిన్నమైన ఫలితం వచ్చుండేదని చెప్పవచ్చు. కానీ అతడు కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు సాధించినందున, తన జాతకంలో ఉన్న గెలుపు అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే 2023 ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించలేకపోయింది” అని లోబో వివరించాడు.

కోహ్లీ-రోహిత్ కలిసి ట్రోఫీ గెలుస్తారా?

“ప్రస్తుతం రోహిత్ శర్మ జాతకం ప్రకారం, అతడు మరో రెండు చిన్న టోర్నమెంట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వాటిలో ఒకటి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఫైనల్‌లో రోహిత్-కోహ్లీ కలిసి టీమిండియాకు విజయాన్ని అందిస్తారు” అని లోబో జోస్యం చెప్పాడు.

అంతేకాదు, రోహిత్ శర్మ జాతకం, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ జాతకానికి చాలా దగ్గరగా ఉందని కూడా అతడు పేర్కొన్నాడు. “ఇద్దరూ ఒకే ఏడాదిలో జన్మించారు” అని చెప్పిన లోబో, రోహిత్ శర్మ కెరీర్‌లో మరిన్ని విజయాలు రాబోతున్నాయని సూచించాడు.

ఈ జ్యోతిష శాస్త్ర విశ్లేషణ నిజమవుతుందా? టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందా? లేదా న్యూజిలాండ్ పట్టు సాధిస్తుందా? అన్నది మార్చి 9న ఫైనల్ మ్యాచ్‌లో తేలనుంది!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *