
దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లతో లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత భారత స్టాక్ మార్కెట్ భారీ పెరుగుదలను చూస్తోంది. వారంలో చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం, మార్కెట్ ప్రధాన సూచిక సెన్సెక్స్ దాదాపు 1,200 పాయింట్ల లాభంతో ప్రారంభమై 74,956.53 వద్ద ట్రేడవుతోంది.