Virat Kohli: 17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్‌తో చెత్త రికార్డ్.. విరాట్ కోహ్లీకి నరకం చూపిస్తోన్న ఆ స్పెషల్ నంబర్

Virat Kohli: 17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్‌తో చెత్త రికార్డ్.. విరాట్ కోహ్లీకి నరకం చూపిస్తోన్న ఆ స్పెషల్ నంబర్


Royal Challengers Bengaluru vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడనే సంగతి తెలిసిందే. మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న ఈ సూపర్‌స్టార్ క్రికెటర్‌కు ఏప్రిల్ 18 తేదీ చిరస్మరణీయమైనది మారలేదు. 17 సంవత్సరాల క్రితం మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సమయంలో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు 2025లో మళ్ళీ ఏప్రిల్ 18న ఆడే అవకాశం వచ్చింది. ఈసారి పంజాబ్ కింగ్స్‌తో మళ్ళీ అతను ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దీంతో ఈ 18 ఏళ్ల యాదృచ్చికతతో ఫ్యాన్స్ గుండెలు కూడా బరువెక్కాయి. ఈ విధంగా, 17 సంవత్సరాల కాలంలో, రెండు వేర్వేరు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలోనూ పరుగులు నమోదు కాలేదు.

2008లో ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగింది. ఇందులో, కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఐదు బంతులు ఆడిన తర్వాత, అశోక్ దిండా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 140 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. బ్రెండన్ మెకల్లమ్ (158 అజేయంగా) అజేయ సెంచరీతో కేకేఆర్ 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడుతున్న ఆర్‌సీబీ జట్టు 15.1 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా

పంజాబ్ కింగ్స్ ముందు విఫలమైన కోహ్లీ..

17 సంవత్సరాల తర్వాత, కోహ్లీ మళ్ళీ ఏప్రిల్ 18న ఆడేందుకు వచ్చాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో బెంగళూరు తలపడింది. ఈ దశలో కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14-14 ఓవర్లకు కుదించారు. ఇందులో కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా వచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీ మొత్తం 3 బంతులు ఆడాడు.

ఇది కూడా చదవండి: నాడు బ్రహ్మ రాతను మార్చాడు.. నేడు విధి రాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే మోస్ట్ ఫ్లాప్ ప్లేయర్‌గా

ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుతమైన రికార్డ్..

అయితే, ఐపీఎల్ తొలి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు అతను 38.92 సగటుతో 8253 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత 1500 పరుగులు వెనుకబడి ఉన్న శిఖర్ ధావన్ పేరు వస్తుంది. ఐపీఎల్‌లో కోహ్లీ పేరు మీద ఎనిమిది సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *