ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత.. మీ ఊహలకు మేం ఏమాత్రం అడ్డురాం.. కానీ మీరు ఊహించినదానికన్నా ఎక్కువే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాం.. యాజ్ ఇట్ ఈజ్గా ఇవే పదాలను వాడకపోయినా, ఎస్ఎస్ఎంబీ29 మేకర్స్ మనసులో మాట ఇదే.
అందులో భాగంగానే నెక్స్ట్ మంత్ ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మహేష్తో పాటు ప్రియాంక, పృథ్వి కూడా ఈ సీక్వెన్స్ లో పార్టిసిపేట్ చేస్తారట.
మహేష్ కోసం హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నారని టాక్. ఈ విషయం వినగానే అందరూ దేవర2 గురించి ఆలోచిస్తున్నారు. దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ మామూలుగా ఉండదని మొదటి నుంచీ ఊరించారు మేకర్స్.
దానికి తగ్గట్టే దేవర వసూళ్ల విషయం లో కూడా బానే మెప్పించింది. అయితే ఇప్పుడు సెకండ్ పార్టులోనూ అంతకు మించిన ఎపిసోడ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఇటు కేజీయఫ్ త్రీక్వెల్లోనూ సముద్రం మీద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందనే మాట ఎప్పటి నుంచో ఊరిస్తోంది. రీసెంట్గా చైతూ కెరీర్లో సూపర్డూపర్ హిట్ అనిపించుకున్న తండేల్లోనూ సముద్రపు ఎపిసోడ్ యమాగా మెప్పించింది జనాలను.