పెరుగును చాలా కాలంగా గట్ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఆహారంగా భావిస్తున్నారు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. లాక్టోస్ ఇన్ టోలరెన్స్, మలబద్ధకం, విరేచనాలు ప్రేగుల వాపు వంటి సమస్యలకు ఇది సహజమైన నివారణగా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరుగును యోగర్ట్ గా తయారు చేసేందుకు అందులోని కొవ్వు శాతాన్ని తగ్గించేస్తుంటారు. ఇందులో ఉండే కొన్ని రసాయనాలు, ముఖ్యంగా ఎమల్సిఫైయర్లు, గట్లో మంటను రేకెత్తించి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుకు యోగర్ట్కు మధ్య తేడా..
పెరుగు సంగతి మనకు తెలిసిందే. కాచిన పాలు చల్లారాక… కాస్త పెరుగు వేస్తే… కొన్ని గంటల్లో పాలు మొత్తం పెరుగు అయిపోతాయి. ఇందుకు కారణం.. పెరుగులో ఉండే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పాలను తినేసి.. పెరుగుగా మార్చేస్తుంది. కొంతమంది నిమ్మరసం, వెనిగర్ వంటివి కూడా వేసి.. పెరుగుగా మార్చుతారు. యోగర్ట్ అనేది మరో రకం. దీన్ని మన ఇళ్లలో తయారుచెయ్యలేం. అంటే.. దీని తయారీలో కృత్రిమ యాసిడ్స్ కలుపుతారు. అంటే ఇది కృత్రిమ ప్రక్రియ ద్వారా తయారయ్యేదని అనుకోవచ్చు.
పెరుగు తింటే కలిగే లాభాలు..
సాధారణంగా పెరుగు ప్రోబయోటిక్స్తో నిండి ఉంటుంది, ఇవి గట్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. దీనిలోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు లాక్టోస్ అసహనం ఉన్నవారికి సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం, పెరుగు పెద్దప్రేగు క్యాన్సర్, అలెర్జీలు హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ సాధారణమైన, సహజమైన పెరుగుకు మాత్రమే వర్తిస్తాయి, తక్కువ కొవ్వు లేదా ప్రాసెస్ చేసిన పెరుగుకు కాదు.
ఈ రకం పెరుగుతో వారికి డేంజర్
నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, యోగర్ట్ తయారుచేసేటప్పుడు దాని ఆకృతి, రుచిని కాపాడటానికి ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు. క్యారేజీనన్ పాలీసోర్బేట్ 80 వంటి ఎమల్సిఫైయర్లు గట్లో మంటను కలిగిస్తాయి. పారిస్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక అధ్యయనంలో, ఈ ఎమల్సిఫైయర్లను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి గట్లో మంట పెరిగిందని, ఇది డీఎన్ఏ దెబ్బతినడానికి దారితీసి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచిందని కనుగొన్నారు. ఈ రసాయనాలు యోగర్ట్ లో ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే కొవ్వును తొలగించడం వల్ల వచ్చే ఆకృతి మార్పులను సరిచేయడానికి వీటిని కలుపుతారు.
ఎమల్సిఫైయర్లు క్యాన్సర్కు ఎలా దారితీస్తాయి?
ఎమల్సిఫైయర్లు గట్ లోపలి పొరను దెబ్బతీస్తాయి, దీనివల్ల దీర్ఘకాలిక మంట ఏర్పడుతుంది. ఈ మంట కణాల డీఎన్ఏలో మార్పులను ప్రేరేపిస్తుంది, ఇది క్యాన్సర్ కణాలు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా యువకులలో పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రకమైన ఆహారపు అలవాట్లు ఒక కారణం కావచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం సహజమైన పెరుగుకు వర్తించదు, ఎందుకంటే ఇది సాధారణంగా ఎటువంటి రసాయనాలు లేకుండా తయారుచేస్తారు.
సురక్షితంగా యోగర్ట్ ఎలా ఎంచుకోవాలి?
ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు దాని పదార్థాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. సహజమైన, పూర్తి కొవ్వు కలిగిన పెరుగు లేదా ఇంట్లో తయారుచేసిన యోగర్ట్ లో ఎల్సిఫైయర్లు ఉండవు, కాబట్టి అవి గట్ ఆరోగ్యానికి సురక్షితమైనవి. తక్కువ కొవ్వు లేదా ఫ్లేవర్డ్ పెరుగులను నివారించడం మంచిది, ఎందుకంటే వాటిలో కృత్రిమ స్వీటెనర్లు, క్యారేజీనన్ లేదా పాలీసోర్బేట్ 80 వంటి రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువ. సేంద్రీయ పెరుగు లేదా గ్రీక్ పెరుగు వంటివి, వాటిలో ఎటువంటి అదనపు రసాయనాలు లేకపోతే, మంచి ఎంపికలు.