Andhra: అబ్బబ్బ.! చల్లని కబురు.. ఏపీకి పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

Andhra: అబ్బబ్బ.! చల్లని కబురు.. ఏపీకి పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక


Andhra: అబ్బబ్బ.! చల్లని కబురు.. ఏపీకి పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

శనివారం (03-05-25)

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు.. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే రేపు ఉష్ణోగ్రతలు 41-42.5°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42°C, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.3°C, కర్నూలు, నెల్లూరు జిల్లా రేవూరులో 41°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *