ఏఐ హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది మొత్తం వర్చువల్ గానే ఉంటారు. 42 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు ఈ ఏఐ హాస్పిటల్ లోని సేవలు అందిస్తారు. చాట్ జిపిటి 3.5 టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఐ రోబోలు ఈ ఏఐ హాస్పిటల్ లోని డాక్టర్ల పనిని నిర్వర్తిస్తున్నాయి. ఈ ఏఐ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీతో సహా మొత్తంగా 21 విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ లో వేగంగా ఖచ్చితత్వం ఈ ఏఐ డాక్టర్ల స్పెషాలిటీ. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఈ ఏఐ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ మానవ డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 82% నుంచి 85% వరకు ఉంటుంది. కానీ ఇక్కడి ఏఐ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 93% వరకు ఉంటుందని సింకోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అదేవిధంగా కొన్ని రోజుల్లోనే దాదాపు 10,000 మంది రోగులకు ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం ఏఐ డాక్టర్లకు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :