హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తుంది. అయితే ఇటీవల ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుతోపాటు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇక ఈ తరహాలో ఎంపికైన కండక్టర్లకు ప్రతినెలా చెల్లించే కన్సాలిడేటెట్ జీతం మొత్తం రూ.17,969గా ఆర్టీసీ నిర్ణయించింది. పైగా ఈ పోస్టులకు ఎంపికైన వారు రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరాక విధి నిర్వహణలో సంస్థకు నష్టం వాటిల్లితే దీని నుంచి రికవరీ చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. అయితే వీరికి వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ అస్సలు వర్తించదని ఆర్టీసీ యాజమన్యం తేల్చి చెప్పింది. పీఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు కూడా ఉండవని స్పష్టం చేసింది.
మరోవారంలో ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓ పోస్టులకు రాత పరీక్ష.. హాల్టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC).. ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) మెయిన్స్ రాత పరీక్ష మరో వారంలో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్స్ను కమిషన్ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు మే 26వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఇక ఏపీపీఎస్సీ జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చి 16న ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జారీ చేసిన 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి
ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓ పోస్టులకు హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.