ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని కబళించిన కరోనా వైరస్ను మనం ఇంకా మరచిపోలేదు. కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతోపాటు ప్రపంచంలోని పలుదేశాలు నమ్ముతున్నాం. ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెబుతోంది. ఐదేళ్ల కిందట వైరస్ దాడిచేస్తే, ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్బెల్స్ మోగిస్తోంది. చైనా ల్యాబ్లో డేంజర్ ఫంగస్ ను సృష్టించినట్లు అమెరికా చెబుతోంది.. ఈ క్రమంలో అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. జియాన్, లియుని అరెస్టు చేసిన అమెరికా FBI.. ప్రస్తుతం ప్రశ్నిస్తోంది.. ప్రమాదకర ఫంగస్ను స్మగ్లింగ్ చేశారంటూ కేసు నమోదు చేసింది.
సంచలన విషయాలు బయటపెట్టిన FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ .. అరెస్టయిన చైనీయుల ద్గగర ఫుసారియమ్ గ్రామినేరమ్ అనే ఫంగస్ ఉన్నట్లు తెలిపింది. ఇది ఆగ్రికల్చరల్ టెర్రరిజమ్ ఆయుధం అంటూ అమెరికా ఆరోపించింది. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ప్రస్తుతం శాంపిళ్లను తరలించారు.
అసలు ఈ ప్రమాదకర ఫ్యాథోజన్ వల్ల ఏం జరగబోతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది.. చైనా ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు.
చైనా నుంచి మిషిగన్ ల్యాబ్. ఈ సుదీర్ఘ ప్రయాణం వెనక కథ ఏంటి? కేవలం అధ్యయనాలేనా? లేక కుట్రలా? అమెరికా చెబుతున్న అంశాలు, చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏకంగా FBI డైరక్టరే చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. కేవలం ప్రయోగాలే అయితే, డ్రాగన్ కంట్రీలో చేస్తే సరిపోతుంది. కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సీన్ సిద్ధం చేశారు.
చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ను ప్రయోగిస్తోందా? అంటే.. అవునంటోంది అమెరికా.. ఇప్పటికే చైనా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటిన్ ఎయిర్పోర్టుకు వచ్చారు.. చైనా కమ్యూనిస్టు పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేయురాలు .. ఈ ఫంగస్పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది.. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని..FBI డైరక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి.. తమ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసే కుట్ర అని పటేల్ తెలిపారు. కుట్ర, వీసా మోసానికి పాల్పడినట్లు అమెరికా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
వుహాన్ ల్యాబ్లో జరిగిన సృష్టి, మళ్లీ మిషిగన్ ల్యాబ్లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తోంది. అందుకే అమెరికా అలర్ట్ అయింది. అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ను సీరియస్గా తీసుకుంది. అమెరికా మీడియా కూడా డ్రాగన్పై చిందులు తొక్కుతోంది. అసలే అమెరికాను చూసి చైనా రగిలిపోతోంది. అగ్రరాజ్యంపై కత్తులు నూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. చైనా ఏమైనా చేయొచ్చని అగ్రరాజ్యానికి అనుమానంగా ఉంది. ఇవన్నీ కలిసి, చైనా ఫంగస్పై అలారమ్ బెల్స్ మోగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..