Tollywood: ఈ హీరోయిన్ మాముల్ది కాదురోయ్.. ఒక్క సినిమా చేయకుండానే 35 కోట్ల నుంచి 350 కోట్లు సంపాదించింది..

Tollywood: ఈ హీరోయిన్ మాముల్ది కాదురోయ్.. ఒక్క సినిమా చేయకుండానే 35 కోట్ల నుంచి 350 కోట్లు సంపాదించింది..


భారతీయ సినీరంగంలో 2000లలో వెండితెరను శాసించిన హీరోయిన్ ఆమె. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. చూడచక్కని అందం, సొట్టబుగ్గల చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ అల్లాడించేసిన ఈ వయ్యారి.. దాదాపు 8 సంవత్సరాలుగా సినీరంగానికి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తుంది. తాజాగా ఈ అమ్మడు లైఫ్ స్టైల్, నెట్ వర్త్ డీటెయిల్స్ తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా… ? రూ. 35 కోట్ల పెట్టుబడితో బిజినెస్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఈ తార రూ.350 కోట్లకు చేరుకుంది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ ప్రీతి జింటా.

ఇటీవల ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి గట్టిపోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ తన జట్టుకు మద్దతు ఇచ్చింది ప్రీతి జింటా. పంజాబ్ కింగ్ జట్టుకు ఈ హీరోయిన్ సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ప్రీతిజింటా ఇప్పుడు వ్యాపారంరంగంలో దూసుకుపోతుంది. ఆమె సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు, పెట్టుబడులు మరియు IPL జట్టులో ఆమె వాటా ద్వారా సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.183 కోట్లు. 2008లో, జింటా పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా మారి రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టారు. జట్టు మొత్తం పెట్టుబడి ఇప్పుడు రూ.250 కోట్లకు పెరిగింది. 2022 నాటికి 76 మిలియన్ డాలర్ల నుండి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది. నివేదిక ప్రకారం ఆమె టిక్కెట్ల అమ్మకాలలో కూడా వాటాలను కలిగి ఉంది. స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సంపాదిస్తుంది.

ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రదేశాలలో ఒకటైన పాలి హిల్స్‌లో ఆమెకు రూ.17.01 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది. ఆమె స్వస్థలం సిమ్లాలో రూ.7 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. జీన్ గుడ్ ఎనఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయ్యింది. వీరు తమ పిల్లలు జై, గియాతో కలిసి బెవర్లీ హిల్స్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాకుండా, ప్రీతికి లెక్సస్ LX 400 క్రాస్ఓవర్, పోర్స్చే, మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, BMW వంటి హై-ఎండ్ కార్ల కలెక్షన్ ఉంది. 7 సంవత్సరాల తర్వాత, ప్రీతి లాహోర్ 1947 చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించి, ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, జింటా తన పాత్రకు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *