పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు.
గురువారం(జూన్ 05) ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల కోసం జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్ ముగింపు కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగిస్తూ, సమాజం కూడా ఐక్యత సందేశాన్ని ఇచ్చింది అని అన్నారు. హేయమైన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు విచారంగా, కోపంగా ఉన్నారు. దోషులను శిక్షించాలని కోరుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సరియైన శిక్ష విధించారు” అని భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశంలోని నిర్ణయాధికారుల ధైర్యాన్ని అందరూ చూశారని ఆయన అన్నారు. పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత చర్య తీసుకోవడం జరిగింది. ఇది మరోసారి మన సైన్యం శక్తిని చూపించింది. అధికారుల దృఢత్వం కూడా కనిపించింది. రాజకీయ వర్గం కూడా పరస్పర అవగాహనను ప్రదర్శించారు. సమాజం కూడా దాని ఐక్యత సందేశాన్ని చాటి చెప్పారన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, శాశ్వత లక్షణంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. భారతదేశం తన భద్రతా విషయాలలో స్వావలంబన కలిగి ఉండాలని మోహన్ భగవత్ అన్నారు. “భారతదేశంతో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని వారు పరోక్ష యుద్ధం అనే విధానాన్ని అవలంబించడం ద్వారా మన దేశాన్ని రక్తసిక్తం చేయాలనుకుంటున్నారు” అని మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వచ్ఛంద శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి గిరిజన నాయకుడు, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పివి నరసింహారావు మంత్రివర్గంలో భాగమైన అరవింద్ నేతమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛత్తీస్గఢ్కు చెందిన నేతమ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మత మార్పిడి అంశాన్ని తీవ్రంగా పరిగణించలేదని అన్నారు. “ఈ ప్రాంతంలో సహాయం చేయగల ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే అని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. ముఖ్య అతిథిగా సత్కరించినందుకు సంఘ్, సర్ సంఘచాలక్లకు నా కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటిసారి ఇక్కడికి వచ్చానని, ఇక్కడ చాలా అర్థం చేసుకున్నానన్నారు. ఇది సంఘ్ శతాబ్ది సంవత్సరం. దేశ ఐక్యత, సమగ్రత, సామరస్యం కోసం సంఘ్ గొప్ప పని చేసిందని అరవింద్ నేతమ్ అన్నారు. మత మార్పిడి ఒక పెద్ద సవాలు అని ఆయన అన్నారు. సంఘ్ నుండి చాలా అంచనాలు ఉన్నాయి. దీనిలో సంఘ్ తన వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. బస్తర్ నక్సలిజం, మత మార్పిడితో పోరాడుతోందని అరవింద్ నేతమ్ ప్రశంసించారు.
కార్యకార్ట్ వికాస్ వర్గ్ ద్వితీయ అనే 25 రోజుల శిక్షణా శిబిరం మే 12న నాగ్పూర్లోని రేషంబాగ్లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్లో ప్రారంభమైంది. ఇందులో దేశవ్యాప్తంగా 840 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..