ఇలా ఒక నెల పాటు చేస్తే, మచ్చలు పూర్తిగా మాయమవుతాయని నిపుణులు అంటున్నారు. జిడ్డు లేదా పొడి చర్మం సమస్యకు కూడా కొబ్బరి నీళ్లు భలేగా పనిచేస్తాయి. ఏ రకమైన చర్మానికైనా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో చాలా మంది జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లను కొద్దిగా వేడి చేసి, తలపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా త్వరగానే సమస్య నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. లేదంటే షాంపూ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లతో జుట్టును కడిగినా ప్రయోజనం ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా, చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది.కొబ్బరి నీళ్ళను శనగపిండితో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కూడా కలపవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఎండలో కమిలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గేటు దాటుతుండగా ట్రాక్పై ఇరుక్కుపోయిన ఈ-రిక్షా.. ఇంతలో