MS ధోనికి అరుదైన గౌరవం! ICC హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. మరో ఆరుగురు కూడా..

MS ధోనికి అరుదైన గౌరవం! ICC హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. మరో ఆరుగురు కూడా..


టీమిండియా మాజీ కెప్టెన్‌, ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ధోనితో పాటు మరో ఆరుగురు కూడా ఈ ఏడాది ఈ గౌరవం పొందారు. వారిలో మ్యాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా), హషీమ్‌ ఆమ్లా (సౌతాఫ్రికా), గ్రేమ్‌ స్మిత్‌ (సౌతాఫ్రికా), డానియల్‌ వెట్టోరి (న్యూజిలాండ్‌), సనా మీర్‌ (పాకిస్థాన్‌), సారా టేలర్‌ (ఇంగ్లండ్‌)లకు కూడా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2025లో చోటు దక్కింది. గతంలో ఇండియా నుంచి కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, బిషన్‌ బేడి, వీరేందర్‌ సెహ్వాగ్‌, రాహుల్ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, డయానా ఎడుల్జీ, వినో మన్కండ్‌, సునీల్‌ గవాస్కర్‌లు ఈ అరుదైన గౌరవం పొందారు.

ఇక ధోని విషయానికి వస్తే.. టీమిండియా తరపున 17,266 అంతర్జాతీయ పరుగులు, 829 అవుట్‌లు, అన్ని ఫార్మాట్లలో 538 మ్యాచ్‌లతో ధోని గొప్ప ప్లేయర్‌గా ఉన్నాడు. 2004లో ధోని జాతీయ జట్టులోకి అడుగుపెట్టినప్పుడు, అప్పటి 23 ఏళ్ల యువకుడు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఈ స్థాయికి ఎదుగుతాడని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. స్టంప్స్ వెనుక ధోని టెక్నిక్ అసాధారణమైనది. అతను వికెట్ కీపింగ్‌ను ఒక ఆర్ట్‌గా మార్చాడు. డిఫ్లెక్షన్ల నుండి రనౌట్‌లను ప్రభావితం చేశాడు, రెప్పపాటులో స్టంపింగ్‌లను పూర్తి చేశాడు. తనదైన శైలితో క్యాచ్‌లను తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడు, ఇతరులతో కలిసి మంచి పార్ట్నర్‌షిప్‌లు నిర్మించగలడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *