విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..

విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..


అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 269 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్‌ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్‌ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి టాటా గ్రూప్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ముందుగా ప్రకటించిన రూ.కోటి ఎక్స్‌గ్రేషియాకు అదనంగా మరో రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యవసర సాయంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా టాటా గ్రూప్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల పరిహారం అందనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *