
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో తన తోటకు కాపలాగా ఉన్న రైతును పాము కాటేసింది. దాంతో ఆ రైతు కర్రతో కొట్టి పామును చంపాడు. వెంటనే తన భార్యతో కలిసి చనిపోయిన పాముతో ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే ఏ పాము కాటేసిందో తెలిస్తే.. దాని కంటే ప్రత్యేక మెడిసిన్ ఉంటుంది. అందుకే అతను తనను కాటేసిన పామును చంపి.. ఆస్పత్రి తీసుకొచ్చి.. తనను కాటేసిన పాము ఇదే అంటూ వైద్యులకు చూపించాడు. ఇది చూసి వైద్యులు ఆశ్చర్యపోయాడు.
షాజహాన్పూర్లోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాడ గౌటియాకు చెందిన రైతు ముంతాజ్ అలీ తోటలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కూడా ఆయన తోటకు కాపలాగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక పొడవైన పాము అతని కాలును చుట్టుకుంది. ఆ తర్వాత అతనికి కాలుకు కాటేసి దగ్గర్లోని బొరియలోకి ప్రవేశిస్తుండగా.. దాని తోకను పట్టుకుని బయటకు లాగాడు. వెంటనే ఒక కర్ర అందుకొని దాన్ని కొట్టి చంపేశాడు. చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి తన భార్య నసీమకు ఈ విషయం చెప్పాడు.
పరిస్థితి విషమించడంతో ముంతాజ్ తన భార్యతో కలిసి పామును ఒక సంచిలో వేసుకుని ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు, అక్కడ డాక్టర్ ముంతాజ్కు చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని కాలు నుండి రక్తం కారుతోంది. ఆ తర్వాత అతని భార్య బ్యాగ్ నుండి చనిపోయిన పామును తీసి వైద్యుడికి చూపించింది. ఆ పాము చూసి.. దాని కాటుకు విరుగుడుగా పనిచేసే మందుతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. ఇలా పాము కాటేసినా.. భయపడకుండా.. దాన్ని చంపి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చిన అతని ధైర్యం చూసి అంతా షాక్ అయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..