ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్లో శనివారం నాడు గ్రాండ్గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్తో టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణలో జరిగినట్లే, ఏపీలో కూడా ఫిల్మ్ అవార్డుల వేడుకను అక్కడి ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో…టాలీవుడ్కు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులకు బడా నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ చెబుతున్నా.. గుర్తు పెట్టుకోండి…అవార్డులు వచ్చినవాళ్లు స్వయంగా ఫంక్షన్కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు కోరారు. ఏ స్టేట్ అయినా, షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని, ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకోవాలన్నారు FDC చైర్మన్.
“ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అయినా సరే, మీరు వచ్చి స్వీకరించాలి.
త్వరలోనే నంది అవార్డులు కూడా ప్రారంభం అవుతాయి..”
– TFDC Chairman #Dilraju pic.twitter.com/fU2E0w8LdN
— Whynot Cinemas (@whynotcinemass_) June 15, 2025
అయితే తెలంగాణ సర్కార్ వైభవోపేతంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కు అవార్డులు వచ్చిన కొందరు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరు కాలేదు. తమకు వచ్చిన అవార్డులను కూడా స్వీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్ రాజు ఈ విజ్ఞప్తి చేసి ఉంటారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలో జరగబోయే సినీ అవార్డుల ఫంక్షన్కు కూడా వాళ్లు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారని భావిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..