ప్రస్తుం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదంలో కీలక పాత్ర ఆహారందే ఉండటం వలన కొన్ని రకాల ఆహారపదార్థాలకు చాలా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హార్వర్డ్ పరిశోధన బృధం చేసిన ఓ పరిశోధనలో కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని చెప్తున్నారు. కాగా , ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
ప్రాసెస్ చేసిన ఫుడ్ క్యాన్సర్ ముప్పుకు పెద్ద కారణం అవుతుందంట. అందుకే వీలైనంత వరకు ఇలాంటి ఆహారపదార్థాలకు చాలా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రాసెస్ చేయబడిన మాంసాలను తినడం వలన ఇందులోని పాలీ సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి సమ్మెళానాలు పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్కు కారణం అవుతున్నాయంట. వీటి వలనే చాలా మంది క్యాన్సర్ బారినపడుతున్నారంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అధికంగా చక్కెర తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఫుడ్ తీసుకోవడం కూడా క్యాన్సర్కు కారణం అవుతుందంట. చక్కెర నేరుగా క్యాన్సర్కు కారణం కానప్పటికీ, అధిక మొత్తంలో చక్కెరను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల మాత్రం క్యాన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు నిపుణులు. చక్కెర ఎక్కువ తీసుకోవడం వలన ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, దీర్ఘకాలిక వాపు వస్తుంది, ఇవన్నీ రొమ్ము , పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయంట. అందుకే చక్కెరకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
ప్యాకింగ్ చేసిన ఆహారాలు కూడా క్యాన్సర్ కారకాలే అంటున్నారు నిపుణులు. అల్ట్రా-ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఆహారాలలో సంకలనాలు, ప్రిజర్వేటివ్లు, సోడియం, ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉంటాయి. ఇవి వాపు, గట్ మైక్రోబయోమ్, జీర్ణ ,ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయంట. అందుకే ప్యాకింగ్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉండాలంట.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అందుకే మద్యపానం, ధూమపానం చేయకూడదంటారు. అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, మితమైన ఆల్కహాల్ వినియోగం కూడా రొమ్ము క్యాన్సర్, కాలేయం, అన్నవాహిక,పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని తేలిందంట. అందుకే వీటికి దూరంగా ఉండటం చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు.