ఐపీఎల్ ఫైనల్లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది. దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూసిన IPL టైటిల్ కల సాకారమైంది. దీంతో స్టేడియంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆర్సీబీ విజయంపై సినీతారలు సోషల్ మీడియాలో స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెంగుళూరు టీమ్ విజయం పై స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. “వెయిట్ ఈజ్ ఓవర్.. ఈసాలా కప్ నమ్దే” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం చాలా ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని, తలపై వాటర్ బాటిల్ తో నీళ్లు పోసుకుని బెంగుళూరు విజయాన్ని ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఫుల్లీ ఎమోషనల్ అంటూ రాసుకొచ్చారు బన్నీ.