టాలీవుడ్ యాంకర్ లాస్య ఇటీవలే మహా కుంభమేళాలో పాల్గొంది. తన కుటంబ సభ్యులతో కలిసి అక్కడ పవిత్ర స్నానం ఆచరించింది.
ఇక మహా కుంభమేళా తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం.. ఇలా అన్ని పుణ్య క్షేత్రాలను తిరిగేస్తోంది లాస్య.
ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి అరుణాచలం శివుడిని దర్శించుకున్న యాంకర్ లాస్య తాజాగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.
తన పెళ్లి రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శిచుకుంది లాస్య. అనంతరం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది.
'మా పెళ్లి రోజు కాలినడకన తిరుమల కొండ ఎక్కాము.. గోవిందా గోవిందా.. ఓం నమఃశివాయ' అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది లాస్య
కాగా లాస్య, మంజునాథ లది ప్రేమ వివాహం. 2017లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.