Andhra: ఊరు శివారు పాడుబడ్డ బావిలో వింత వాసన.. డౌట్ వచ్చి.. వెళ్లి చూడగా

Andhra: ఊరు శివారు పాడుబడ్డ బావిలో వింత వాసన.. డౌట్ వచ్చి.. వెళ్లి చూడగా


Andhra: ఊరు శివారు పాడుబడ్డ బావిలో వింత వాసన.. డౌట్ వచ్చి.. వెళ్లి చూడగా

ఒంగోలు సమీపంలోని అప్పాయికుంట సమీపాన రోడ్డు పక్కన ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అప్పటికే పాతపాడు గ్రామానికి చెందిన 55 ఏళ్ళ మూరబోయిన అర్జున్‌ రెడ్డి.. మార్చి 19వ తేది నుంచి కనిపించడం లేదని బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో గాలిస్తున్న పోలీసులకు అర్జున్‌రెడ్డి భార్య సుశీల, ఆమె ప్రియుడు రమేష్‌రెడ్డి కనిపించకుండా పోయారన్న సమాచారం అందింది. దీంతో పోలీసులు రమేష్‌రెడ్డిపై అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఎట్టకేలకు రమేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పాయికుంట దగ్గర మృతదేహం లభించడంతో అర్జున్‌రెడ్డి బంధువులకు సమాచారం అందించారు. బావిలో ఉన్న మృతదేహం అర్జున్‌రెడ్డిదేనని బంధువులు గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు రమేష్‌రెడ్డి గతంలో భార్యను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య..

ఒంగోలు మండలం పాతపాడుకు చెందిన కావూరి రమేష్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి భార్య సుశీల మధ్య గత ఇరవై ఏళ్ళుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం ఇటీవలే గుర్తించిన అర్జున్‌రెడ్డి వీరిద్దరిని వారించారు. తరచూ ఇంటికి వస్తున్న రమేష్‌రెడ్డిని రావద్దని మందలించాడు. అయితే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని వదులుకోలేని రమేష్‌రెడ్డి, ఎలాగైనా అర్జున్‌రెడ్డి అడ్డుతొలగించుకోవాలని పధకం వేశాడు. గత నెల మార్చి 19వ తేదిన పాతపాడు నుంచి ఆటోలో అర్జున్‌రెడ్డి ఒంగోలుకు వస్తున్నట్టు తెలుసుకున్న రమేష్‌ రెడ్డి మార్గంమధ్యలో ఆటోను ఆపి అర్జున్‌రెడ్డితో మాట్లాడాలని తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. ఒంగోలులో మద్యం కొనుగోలు చేసి దశరాజుపల్లి వెళ్ళే మార్గంలోని అప్పాయికుంట దగ్గర ఇద్దరూ మద్యం సేవించారు. అర్జున్‌రెడ్డికి మద్యం ఎక్కువగా తాగించి అనంతరం అతని తలపై రాయితో కొట్టి చంపేశాడు రమేష్‌రెడ్డి. అర్జున్‌రెడ్డి చనిపోయినట్టు నిర్ధారించుకుని అనంతరం సుశీలకు సమాచారం అందించాడు. రమేష్‌రెడ్డితో కలిసి సుశీల తన భర్త అర్జున్‌రెడ్డి మృతదేహాన్ని అప్పాయికుంట సమీపంలోని బావిలో పారేశారు. అనంతరం ఏం తెలియనట్టు నటిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత రమేష్‌రెడ్డి, సుశీల కూడా కనిపించకుండా పోయారు. దీంతో అనుమానం వచ్చిన అర్జున్‌రెడ్డి బంధువులు ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయిచండంతో అర్జున్‌రెడ్డి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అర్జున్‌రెడ్డిని హత్య చేసిన అనంతరం రమేష్‌రెడ్డి, సుశీల కలిసి మృతదేహాన్ని బావిలో పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2012లో కూడా తన భార్యను హత్య చేసిన కేసులో రమేష్‌రెడ్డి నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *